దసరా మిస్ అయినా దీపావళి బ్లాక్ చేస్తున్న అఖండ!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈయన గత కొంతకాలంగా హిట్స్ లేక రేసులో వెనుకబడి పోతున్నాడు.ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.

అటు బోయపాటి శ్రీను కూడా ప్లాపులతో సతమత మవుతున్నాడు.అందుకే ఈ సినిమాతో ఇద్దరు మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.ఎందుకంటే ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.

కరోనా వల్ల ఆలస్యం లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

కానీ కరోనా కారణంగా అన్ని తారుమారు అయ్యాయి.ఇక ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా దసరా సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరు భావించారు.

"""/"/ కానీ ఇంకా షూట్ బాలన్స్ ఉండడం వల్ల ఈ సినిమాను దసరా బరిలోకి దింపలేదు.

అయితే దసరా సీజన్ మిస్ అయినా కూడా అఖండ దీపావళి సీజన్ ను బ్లాక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంతకుముందు అనుకున్నట్టు గానే ఈ సినిమాను దీపావళి సీజన్ లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని సమాచారం.

"""/"/ ఇక ఈ సినిమా కోసం ఒక డేట్ కూడా బ్లాక్ చేసారని తెలుస్తుంది.

ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయాలని అందుకోసం ఈ డేట్ ను లాక్ చెయ్యాలని చూస్తున్నట్టుగా తాజాగా సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది.

ఇక దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వైరల్ వీడియో: వామ్మో ఈ జంతువు ఏంటి ఇలా ఉంది.. మత్స్యకారునికి షాకింగ్ ఘటన..