కేజీఎఫ్3 సినిమాలో హీరో అజిత్ అంటూ జోరుగా ప్రచారం.. ఆ ఛాన్స్ ఉందంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )గురించి మనందరికీ తెలిసిందే.

చివరగా ప్రశాంత్ సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో తన గురించి మాట్లాడుకునేలా చేశారు ప్రశాంత్ నీల్.

ఇకపోతే ప్రశాంత్ దర్శకత్వం వహించిన సలార్ పార్ట్ 1 కి, సీక్వెల్ గాపార్ట్ 2 కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

దీంతో సలార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి ( Sriya Reddy )వంటి నటీనటులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

"""/" / అయితే తాజాగా ప్రశాంత్ నీల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌ ( Ajith Kumar )తో ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు చేయబోతున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇందులో ఒక సినిమా పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా రాబోతుందట.మరొకటి రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్‌ యూనివర్స్‌ కి లింక్ చేస్తుందని సమాచారం.

అంటే కేజీఎఫ్ 3( KGF 3 ) కంటే ముందే అజిత్ నీల్ సినిమా వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా నుంచే కేజీఎఫ్ 3కి లీడ్ తీసుకుంటారని సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.

అజిత్‌ తో తీసే మొదటి సినిమా 2025లో మొదలై 2026లో రిలీజ్ అవ్వబోతుందట.

"""/" / ఇప్పటికే ఈ వార్తతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

అజిత్‌తో తీసే రెండు సినిమాల్లో కేజీఎఫ్ యూనివర్స్‌కి లింక్ చేసే చిత్రంపై ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

సాధారణంగానే అజిత్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు భారీగా ఉంటాయి.అలాంటి హీరోకి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తగిలితే సినిమా బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఈ రూమర్స్‌లో ఎంతవరకూ నిజం ఉందో చూడాలి మరి.

ఇండియాలో సేఫ్ లొకేషన్ ఏది.. యూఎస్ యువతి అడిగిన దానికి ఆన్సర్లు ఇవే..?