పదేళ్లుగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న అజిత్... ఆ సంఘటనే కారణమా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజిత్ ఈ సంక్రాంతి కానుకగా తునివు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సంక్రాంతి కానుకగా విజయ్ అజిత్ ఇద్దరు కూడా బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.అయితే విజయ్ నటిస్తున్న వరిసు సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

కానీ అజిత్ మాత్రం తునివు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఈయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే అజిత్ దాదాపు పది సంవత్సరాలుగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

సాధారణంగా ఒక హీరో నటించిన సినిమా విడుదలవుతుంది అంటే పెద్ద ఎత్తున ఆ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తారు.

అయితే సినిమా బాగుంటే సినిమాలకు ప్రమోషన్ అవసరం లేదని అజిత్ విశ్వసిస్తారు.అంతేకాకుండా గతంలో జరిగిన ఓ సంఘటన కారణంగా కూడా ఈయన సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.

"""/"/ కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ అజిత్ అభిమానుల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి.

మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే విషయంలోనే ఈ ఇద్దరి అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతాయి.

గత పది సంవత్సరాల క్రితం ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ అజిత్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకుని తీవ్ర పరిణామాలకు దారి తీసింది.

ఈ వివాదంలో ఒక అభిమాని ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఘటన అజిత్ ను బాగా కలిచివేసిందని అప్పటినుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తాను ఇలాంటి ప్రమోషన్లకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారట.

అందుకే ఈయన గత పది సంవత్సరాల నుంచి సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

1947 నాటి రూ.5 నోట్ చూసారా.. దాని విశేషమిదే..