మహేష్‌పై కామెంట్స్‌తో వివాదం రేపిన అజయ్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌ను షేక్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి, ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.

ఇప్పటికే రెండేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్, మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే తాజాగా అజయ్ భూపతి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాన్ని క్రియేట్ చేస్తున్నాయి.

తాజాగా ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో లైవ్ చాట్ చేస్తున్న సందర్భంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను ఎప్పుడు డైరెక్ట్ చేస్తారని కార్తికేయ అడిగాడు.

దీనికి బదులుగా మహేష్‌ను డైరెక్ట్ చేయాలంటే మరో 3-4 సినిమాలు చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

అటు పవన్‌తో సినిమా చేయాలంటే తనకు మరో పదేళ్ల పాటు ఆగాల్సి వస్తుందని ఆయన అన్నారు.

దీంతో మహేష్ ఫ్యాన్స్‌కు కోపం కట్టలు తెంచుకుంది.వారు అజయ్ భూపతిపై నెగెటివ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

‘చేసిందే ఒక సినిమా.అప్పుడే వివాదాలు క్రియేట్ చేయవద్దు’ అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.

మరి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఆయన ఎలా చల్లబరుస్తాడో చూడాలి.

వైరల్: ఇందుకే కాబోలు సచిన్ ను క్రికెట్ గాడ్ అనేది..