మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య.. ఫోటో వైరల్!

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan).

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది.ఇదివరకే మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకోగా తాజాగా రెండవ భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

పొన్నియన్ సెల్వన్2 ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి స్టార్ సెలబ్రిటీలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

"""/" / పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్2 పై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

అలాగే ముంబైలో ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది.

ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానుల సమక్షంలో ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) చేసిన పనికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / మిస్ వరల్డ్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు.

ఇలా ఒక స్టార్ హీరోయిన్ అందరి ముందు డైరెక్టర్ మణిరత్నంకు పాదాభివందనం చేశారు.

ముంబైలో మంగళవారం జరిగిన ‘చోళ టూర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ ఐశ్వర్యరాయ్ తన గురుభక్తిని చాటుకున్నారు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

యూఎస్‌: సరస్సులో ప్రత్యక్షమైన చేప.. మానవ దంతాలతో విచిత్రంగా ఉందే..?