కర్ణాటక కేబినెట్ ఏర్పాటుపై ఏఐసీసీ కసరత్తు..!!

కర్ణాటక మంత్రివర్గం ఏర్పాటుపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది.ఈ మేరకు ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు ఏఐసీసీ నేతలతో సమావేశం అయ్యారు.

కేబినెట్ లో ఎవరెవరినీ చేర్చుకోవాలనే వ్యవహారంపై నాయకులతో చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో కర్ణాటక ఇంఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలాతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

కాగా కేబినెట్ ఏర్పాటుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాప పుట్టిన తర్వాత తొలిసారి.. నా మనసంతా అక్కడే.. మనోజ్ కామెంట్స్ వైరల్!