ఆహా 'ఇండియన్ ఐడల్' జడ్జ్ ఎవరో తెలుసా..?

తెలుగు ఓటీటీ సంస్థ ఆహా త్వరలో ఇండియన్ ఐడల్ తెలుగు షో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

నేషనల్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఇండియన్ ఐడల్ షోని తెలుగులో ప్లాన్ చేయడం క్రేజీగా ఉంది.

ఇక ఈ షోకి యాంకర్ గా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరాం చంద్ర చేస్తుండగా ఒక జడ్జ్ గా మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఫిక్స్ అయ్యారు.

ఇక లేటెస్ట్ గా మరో జడ్జ్ ని కూడా ఫిక్స్ చేశారు.లేడీ సింగర్ ప్రముఖ యాక్టర్ నిత్యా మీనన్ ని ఇండియన్ ఐడల్ జడ్జ్ గా సెలెక్ట్ చేశారు.

ఆమెని రివీల్ చేయకుండా ఆహా ఇండియన్ ఐడల్ జడ్జ్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది ఆహా.

మొత్తానికి థమన్, నిత్యా మీనన్ జడ్జ్ లుగా ఈ షో వస్తుంది.ఓ పక్క ప్రముఖ ఛానెల్స్ లో సరిగమప, సూపర్ సింగర్స్, పాడుతా తీయగా అంటూ రియాలిటీ షోలు వస్తున్నా.

ఇండియన్ ఐడల్ షోకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ షో కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుందని అంటున్నారు.

రియాలిటీ షోకి గ్లామర్ కావాలి కాబట్టి నిత్యా మీనన్ లాంటి పాపులర్ హీరోయిన్ ని జడ్జ్ గా తీసుకున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం నిత్యా మీనన్ పవన్ భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తుంది.

ప్రభాస్ వల్ల ఇమాన్వి ఖాతాకు భారీగా పెరిగిన ఫాలోవర్లు.. ఏకంగా అంతమందా?