తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది.ఈ మేరకు పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పర్యటనను హోరెత్తిస్తున్నారు.

ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

అందోల్, సంగారెడ్డితో పాటు కామారెడ్డిలో ప్రచారం చేయనుండగా కాంగ్రెస్ తరపున ప్రచారాల్లో పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు.

ఈ క్రమంలో మక్తల్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రచారం నిర్వహించనుండగా వరంగల్ వెస్ట్, కరీంనగర్ నియోజకవర్గాల్లో భూపేశ్ బఘేల్ ప్రచారం చేపట్టనున్నారు.

మగవారికి క్షమాపణలు తెలిపిన ఫ్లిప్ కార్ట్.. ఎందుకో తెలుసా.?