పూరితో గొడవలా అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో మహేష్‌ ఏం చేశాడో తెలుసా..!

మహేష్‌బాబు కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్నో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు ఉన్నాయి.

ఎన్ని బిగ్‌ సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నా కూడా మహేష్‌బాబు కెరీర్‌లో పోకిరికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

మహేష్‌ బాబు కెరీర్‌ ఆరంభంలోనే సూపర్‌ స్టార్‌గా చేసిన సినిమా అది.పోకిరి వల్లే మహేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యాడనే టాక్‌ ఉంది.

అందుకే ఆ చిత్రం మహేష్‌బాబుకు చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు.అలాంటి పోకిరి సినిమాను ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్‌ గారి గురించి మహర్షి ప్రీ రిలీజ్‌ వేడుకలో మహేష్‌బాబు మాట్లాడటం మర్చి పోయాడు.

దాంతో అంతా కూడా సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ వ్యాఖ్యలు చేశారు.పూరి జగన్నాధ్‌తో మహేష్‌బాబుకు వివాదం ఉంది, అందుకే తనకు పోకిరి ఇచ్చిన దర్శకుడి గురించి మహేష్‌ బాబు మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు అంటూ కామెంట్స్‌ వినిపించాయి.

ఎంత పెద్ద వివాదం ఉన్నా కూడా ఇలాంటి సమయంలో తన దర్శకుడి గురించి మహేష్‌ బాబు మాట్లాడితే బాగుండేది కదా అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో మహేష్‌బాబును దోషిగా నిలబెట్టారు.దాంతో వెంటనే స్పందించిన మహేష్‌బాబు ట్వీట్‌ చేశాడు.

ప్రీ రిలీజ్‌ వేడుకలో పూరి గురించి మాట్లాడటం మర్చి పోయాను.ఆయన నన్ను సూపర్‌ స్టార్‌ చేసిన దర్శకుడు, ఆయన నా కెరీర్‌లో ఎప్పటికి ప్రముఖమైన స్థానం ఉంటుందని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.

నా ఈ 25 సినిమాల జర్నీలో పూరి జగన్నాధ్‌ గారితో అనుబంధం చాలా బలమైనది అంటూ మహేష్‌ చెప్పుకొచ్చాడు.

నాకు పోకిరి వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చినందుకు మీకు ఎప్పటికి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేసి తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాడు.

పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!