కీరవాణి తర్వాత థమన్ కు ఛాన్స్ ఇస్తున్న రాజమౌళి..?

రాజమౌళి సినిమా అంటే మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణి ఫిక్స్ అవ్వాల్సిందే.తను అన్నయ్య అనే కాదు తనకు కావాల్సిన మ్యూజిక్ రప్పించుకోవడంలో వారిద్దరి మధ్య మంచి ర్యాపో ఉంటుంది.

ఈ క్రమంలో కీరవాణి తర్వాత రాజమౌళి మ్యూజిక్ డైరక్టర్ గా ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అంటే ప్రస్తుతం అందరు చెప్పే ఒకే ఒక్క పేరు ఎస్.

ఎస్ తమన్ అనే.మొదట్లో తన పాటలని కాపీ ట్యూన్స్ అని ట్రోల్స్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు తమన్ మ్యూజిక్ సూపర్ డూపర్ అనేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది.

ముఖ్యంగా బిజిఎం ఇవ్వడంలో తమన్ తర్వాతే ఎవరైనా అన్నట్టు ఇచ్చాడు.రాజమౌళి సినిమాలకు కూడా మ్యూజిక్ చాలా ప్రాధాన్యత ఉంటుంది.

బిజిఎం కూడా అదే రేంజ్ లో ఉంటుంది.చూస్తుంటే కీరవాణి తర్వాత తమన్ నే జక్కన్న తన సినిమాలో పెట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఒకవేళ అలాంటి ఛాన్స్ తమన్ కొట్టేస్తే మాత్రం ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు.

 అఖండ మ్యూజిక్ తో తమన్ మరో మెట్టు ఎక్కాడని ఆడియెన్స్ అంటున్నారు.

కిర్గిజ్‎స్థాన్‎లో తెలుగు విద్యార్థి మృతి..!