నన్ను ఇండస్ట్రీలో ప్రోత్సహించింది ఆ హీరోలే.. సినిమా తప్ప ఏం తెలీదు: అడివి శేష్

క్షణం, గూడచారీ వంటి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హీరోలలో అడివి శేష్ ఒకరు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీ అయ్యారు.

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి అడివి శేష్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.

ఈయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా అడివి శేష్ మేజర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఇలా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న అడివి శేష్ ఈ సినిమా గురించి తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

నేను ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టగానే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారని అయితే తనకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదని అడివి శేష్ వెల్లడించారు.

ఈ విధంగా అతను పలు సినిమాలలో నటిస్తూ ఉన్నప్పటికీ ఎంతో మంది హీరోలు తనని ప్రోత్సహించారని అలా ఆ హీరోలు ప్రోత్సహించడం వల్లే నేడు స్థానంలో ఉన్నానని వెల్లడించారు.

క్షణం సినిమా సమయంలో అల్లు అర్జున్ సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ తనకు ట్వీట్ చేయడం ఎప్పుడు మర్చిపోలేను అని తెలిపారు.

పంజా సినిమా షూటింగ్ సమయంలో కో-డైరెక్టర్ వచ్చి హీరో కంటే ఎక్కువ చేస్తున్నావ్ కాస్త చూసుకో అంటూ తనకు చెప్పారు.

ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కో డైరెక్టర్ ను ఆపి తనని చెయ్యనివ్వు అంటూ తనని వెల్లడించారు.

"""/" / ఇక బాహుబలి సినిమా సమయంలో నేనేం చేసిన దగ్గరుండి నన్ను పరిశీలిస్తూ, నన్ను చూసుకున్నది ప్రభాసేనని, నన్ను నమ్మి పాన్ ఇండియా స్థాయిలో మేజర్ సినిమాని మహేష్ బాబు నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా అడివి శేష్ వెల్లడించారు.

ఈ విధంగా ఈ హీరోల ప్రోత్సాహంతోనే తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని నన్ను ఇండస్ట్రీలో పైకి లేపింది ఈ హీరో లేనని, నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం ఏమీ తెలియదని ఈ సందర్భంగా అడివి శేష్ తన కెరీర్ గురించి తనని ప్రోత్సహించిన హీరోల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భార్య మంగళ సూత్రం అమ్మి పేకాట.. ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించారా?