స్పెషల్ షో అనంతరం 'మేజర్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎవ్వరు చేయని సాహసం చేస్తున్నారా?

ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.

ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.

మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.

అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.రియల్ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

వాస్తవ సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించారు.

శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.

జూన్ 3న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఇటీవలే విడుదల అయినా ట్రైలర్, పాటలు బాగా ఆకట్టు కుంటున్నాయి.ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/05/Ai-Sesh-Major-grand-pre-release-event-detailsa!--jpg" / అయితే ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా విషయంలో చేయని విధంగా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ షోలను వేస్తున్నారు.

ఈ నిర్ణయం తీసుకుని పెద్ద సాహసమే చేస్తున్నారు అని చెప్పాలి.ఇక అడవి శేష్ తాను పెరిగిన వైజాగ్ లో కూడా ప్రీమియర్ వేస్తుండగా దీనిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు అడవి శేష్.

వైజాగ్ లో మే 29న సాయంత్రం 4 గంటలకు మేజర్ షో పడనుండగా ఈ షో తర్వాత అక్కడ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు.

మరి వీరు చేస్తున్న పని సక్సెస్ అయితే ఈయన బాటలోనే మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

ఇందులో అడవి శేష్ కు జోడీగా శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.

మహేష్ నిర్మించిన ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి