సుధీర్ పరువు తీసిన అదిరే అభి.. బళ్లు ఓడలు అయ్యాయని చెబుతూ?

బుల్లితెరపై ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రముఖ ఆర్టిస్ట్ లలో సుడిగాలి సుధీర్ ఒకరనే సంగతి తెలిసిందే.

సుడిగాలి సుధీర్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుండగా ఈటీవీ ఛానల్ కు దూరమైన సుధీర్ స్టార్ మా ఛానల్ కు దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే.

వచ్చే ఆదివారం రోజున ఈటీవీ ఛానల్ లో పార్టీ చేద్దాం పుష్ప పార్ట్2 ప్రసారం కానుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.ప్రోమోలో దీపికా పిల్లి గోవిందుడు అందరివాడేలే సినిమాలోని రారారా కుమారా పాటకు అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశారు.

దీపిక డ్యాన్స్ పర్ఫామెన్స్ ను చూసి అనసూయ ఇంటి పేరు చూసి పిల్లి అనుకుంటివా పులి అంటూ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత అదిరే అభి స్కిట్ లో భాగంగా ప్రజల కోరికలను తీర్చడమే రాజు కర్తవ్యమని చెప్పగా పక్కన ఉన్న వ్యక్తి అయితే నేనే రాజు అని చెబుతాడు.

ఎలా అని రాజు పాత్రలో ఉన్న అభి అడగగా చెలికత్తెల కోరికలు అంటూ పక్కన ఉన్న వ్యక్తి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగా ఆ ఎక్స్ ప్రెషన్స్ ను చూసి నాగబాబు వాడికి సుధీర్ పూనాడని చెప్పుకొచ్చారు.

"""/" / ఆ తర్వాత ఒక యువతి ఓడలు బళ్లు బళ్లు ఓడలు కావడం అంటే ఏమిటని అడగగా యాంకరింగ్ చేసే నేను కామెడీ చేసుకుంటూ కామెడీ చేసే సుధీర్ యాంకరింగ్ చేసుకుంటూ ఉండటం అని అదిరే అభి వెల్లడించారు.

"""/" / ఆ తర్వాత అవినాష్ కొడుకు నాగబాబు సార్ కు మీరు వార్నింగ్ ఇచ్చినట్టు కల వచ్చిందని చెప్పగా అవినాష్ నాగబాబు వద్దకు వచ్చి మిస్టర్ నాగబాబు ఇది కరెక్ట్ కాదు అంటూనే నాగబాబు కాళ్లపై పడ్డారు.

ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డికి లవ్ ప్రపోజ్ చేశారు.అషుకు నేను ఏమివ్వగలనని గుండెను గులాబీగా చేసి ఇవ్వడం తప్ప అంటూ ఎక్స్ ప్రెస్ హరి ప్రపోజ్ చేశారు.

అయితే అషురెడ్డి ఏం చెప్పారో ఏం చెప్పారో ప్రోమోలో చూపించలేదు.

ఖడ్గం సినిమా విషయంలో ఈ ఒక్క లోటు ఎప్పటికి ఎందుకు ఉంది ?