ఆదిపురుష్ పై ట్రోల్స్ చేస్తే దేవుడే శిక్షిస్తాడు.. డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆదిపురుష్ ( Adipurush )సినిమా మూడు రోజుల్లో ఏకంగా 340 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈరోజు పలు థియేటర్లలో ఈ సినిమా బుకింగ్స్ భారీ రేంజ్ లో ఉండగా కొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.

మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిపురుష్ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్ కు ధన్యవాదాలు అని అన్నారు.

మైత్రీ మూవీస్ మా సినిమాలను మేమే ప్రమోట్ చేసుకోవాలని డిస్ట్రిబ్యూషన్ ను మొదలుపెట్టిందని ఆయన తెలిపారు.

ఆదిపురుష్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం రావడం సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.

ఈ సినిమా చూడటానికి కొంతమంది ఫోటోలు పట్టుకుని వచ్చారని పిల్లలు ఈ సినిమాను చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

"""/" / సినిమా నిడివి 3 గంటలు అయినా పిల్లలు ఆసక్తిగా ఈ సినిమాను చూశారని డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ ఈ జనరేషన్ ప్రేక్షకుల కొరకు తీసిన మూవీ అని థియేటర్లలో పిల్లలు జై శ్రీరాం( Jai Sriram ) అంటూ కామెంట్ చేశారని ఆయన అన్నారు.

ఓం రౌత్ ఏది అనుకున్నాడో అదే తెరకెక్కించాడని శశిధర్ రెడ్డి చెప్పుకొచ్చారు.నైజాంలో మూడు రోజుల్లో 29 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని ఆయన తెలిపారు.

"""/" / ట్రోల్స్ విపరీతంగా ఉన్నా భారీగా కలెక్షన్లు వచ్చాయని శశిధర్ రెడ్డి అన్నారు.

దేవుడి సినిమాను ట్రోల్స్ చేసే స్థాయికి దిగజారారని ఆయన తెలిపారు.ట్రోల్స్ చేసేవాళ్లను దేవుడే చూసుకుంటాడని ఏం చేయాలో అది చేస్తాడని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

శశిధర్ రెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్తున్నాయి.ఆదిపురుష్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాలి.

రజినీకాంత్ యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి..?