అధిపురుష్ ఈవెంట్ విజయవంతం కావడంతో శ్రీవారిని దర్శించుకున్న చిత్ర బృందం

మంగళవారం సాయంత్రం జరిగిన అధిపురుష్ ఈవెంట్ విజయవంతం కావడంతోబుదవారం నాడు ఉదయం అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్, డైరెక్టర్ ,మ్యూజిక్ డైరక్టర్ మరియు చిత్ర బృందం తిరుపతిలో ఆది పురుష్, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన వారు బుదవారం నాడు తెల్లవారుజామున సినిమా యూనిట్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆది పురుష్ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ ఆఫ్టర్ కామింగ్ ఆలయమును దర్శించుకున్ననందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆలయం చాలా బాగుంది అలాగే నిన్న సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన ఈ తెల్లవారుజామున దర్శనం చేసుకోవడం జరిగింది.

ఈనెల 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా ఆది పురుష్ సినిమా ప్రదర్శితమయ్యే అన్ని సినిమా థియేటర్లలో ప్రతి షోకి ఒక సీటు ఖాళీగా ఉంచాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

రామనామ పారాయణం జరిగే చోటికి హనుమంతుడు వస్తాడని భక్తుల విశ్వాసం.కనుక హనుమంతుని కోసం ఈ సీట్ ని కేటాయించాలని నిర్మాతలు తెలిపారు.