దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రారంభించిన ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో నిరుద్యోగి లింగంపల్లి అశోక్ ఏర్పాటు చేసుకున్న దర్బార్ బిర్యాని సెంటర్ ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.

బిర్యాని సెంటర్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం సంతోషకరమని, స్వయం ఉపాధి పొందుకోవాలని ఆది శ్రీనివాస్ సూచించారు.

ప్రభుత్వం స్వయం ఉపాధి కి అండగా నిలుస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పిటిసి సభ్యులు నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, బొజ్జ మల్లేశం, భీమరాజు కనకరాజు, చంద్రం, తదితరులు పాల్గొన్నారు.

ఈ నటీమణులు ఎంత తక్కువ వయసులో హీరోయిన్లు అయ్యారో తెలిస్తే..?