హర్రర్ సినిమాలంటే భయం.. కానీ మరణం సినిమా బాగుందంటున్నా అడవి శేష్!

క్షణం, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రలలో నటించి ఎంతగానో అందరినీ ఆకట్టుకున్న అడవిశేషు ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నారు.

ఉగ్రవాదుల దాడులలో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

తాజాగా అడవి శేషు వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో, వీర్‌ సాగర్‌ దర్శకత్వంలో హ్రరర్‌ చిత్రం మరణంసినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అడవిశేషు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈ హీరో మాట్లాడుతూ.

"""/"/ మరణం పోస్టర్ ఎంతో బాగుందని, చూడగానే భయపడే విధంగా ఉందని తెలియజేశారు.

అంతేకాకుండా తనకు హర్రర్ సినిమాలు అంటే చాలా భయం అని తెలియజేశారు.చాలా మందికి ఇలాంటి సినిమాలు చూడటానికి ఎంతో భయపడుతుంటారు.

కానీ ఎంతో ఆసక్తికరంగ కొనసాగే ఈ సినిమాలను చూడటానికి చాలా మంది ఇష్టపడతారని ఈ సందర్భంగా అడవిశేషు తెలిపారు.

కానీ మరణం సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా అడవి శేషు తెలియజేశారు.

మరణం పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకులు మాట్లాడుతూ.మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అడవి శేషు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

అదే విధంగా నన్ను నా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన రేణుకా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్ మరణం సినిమాను ఓషియన్‌ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మరి అందరిని ఆకట్టుకుంటుంది.

వావ్, స్వర్గానికి మెట్లు క్రియేట్ చేసిన చైనీస్ ఆర్టిస్ట్..