రోడ్డు పై బట్టలు విప్పానని.. అతడిని తిట్టానని నన్ను కావాలనే టార్గెట్ చేసారు….

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలంటూ, అలాగే అవకాశాల కోసం వచ్చేటువంటి నటీనటులను కొంతమంది తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రలోభ పెడుతున్నారంటూ మీ టూ ఉద్యమానికి తెర లేపిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమను వదిలిపెట్టి వెళ్లిపోయినప్పటి నుంచి ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

కాగా తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిక ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా కొందరు నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అంతేగాక గతంలో కూడా తాను రోడ్డుపై బట్టలు విప్పింది.పవన్ కళ్యాణ్ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసానని కొందరు కావాలనే తనను టార్గెట్ చేసి టార్చర్ చేశారని దాంతో తను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని ఎమోషనల్ అయ్యింది.

"""/"/ అంతేగాక తాను ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి కామెంట్లు చేయాల్సి వచ్చిందో సరైన వివరణ ఇచ్చినప్పటికీ అర్థం చేసుకోకుండా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తనని తన కుటుంబ సభ్యులను అసభ్యకర పదజాలంతో దారుణంగా దూషించారని వాపోయింది.

అంతేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో అతడిని ముందు నుంచి ఎదుర్కోలేక ప్రతిపక్ష రాజకీయ నాయకులు మత కల్లోలాలు సృష్టించి చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారని ఇది సరికాదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటి నుంచి శ్రీ రెడ్డి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.

అంతేకాక తన నిరసనను సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేస్తోంది.

ప్రస్తుతం యూట్యూబ్ లో వంటలు, ఆరోగ్యానికి సంబందించిన చిట్కాల వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేసే రెండు సినిమాలు ఇవే…