బిగ్ బాస్ వల్ల ఆయనకే లాభం.. పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కాయి: షకీలా

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.

ఈ కార్యక్రమం ఇటీవల 7వ  సీజన్ పూర్తి చేసుకుని త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఏడవ సీజన్లో భాగంగా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) విజేతగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈయన విజేతగా బయటకు వచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో నటి షకీలా( Shakeela ) కూడా పాల్గొని సందడి చేశారు.

అయితే ఈమె హౌస్ లోకి వెళ్లిన రెండవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు.

"""/" / ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ కేవలం నాకు ప్రియాంక, దామిని, సందీప్ మాస్టర్, అమర్ మాత్రమే నిజాయితీగల వారనిపించిందని తెలిపారు.

ఇక శివాజీ గారు న్యూట్రల్ గా ఉంటారని తెలియజేశారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ గురించి షకీలా మాట్లాడిన వ్యాఖ్యలు కాస్త సంచలనగా మారాయి.

"""/" / పల్లవి ప్రశాంత్ ఈ కార్యక్రమంలోకి ఒక పిల్లి లాగా ఎంట్రీ ఇచ్చారు.

కానీ తనకు కొంచెం క్రేజ్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయని తెలిపారు.పల్లవి ప్రశాంత్ అందరూ అనుకున్నంత మంచివాడు కాదని ఈమె తెలియజేశారు.

సీనియర్ సెలబ్రిటీలు ముందు ఉన్నా కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వాడని తెలిపారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమం వల్ల ఎవరికి పెద్దగా ప్రయోజనం లేదు.నేను ఈ కార్యక్రమానికి పేమెంట్ ఇస్తేనే వెళ్లి వచ్చానని తెలిపారు.

అయితే ఈ కార్యక్రమం వల్ల కేవలం నాగార్జున( Nagarjuna ) గారికి మాత్రమే లాభం అని తెలిపారు.

ఆయన అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ ఉంటుంది అంతేకాకుండా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తారు కనుక అతనికి మాత్రమే లాభం ఉంది అంటూ షకీలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అవినీతి ఆరోపణలు.. సింగపూర్‌లో భారత సంతతి నేత ఈశ్వరన్‌కు షాక్