రవితేజ సెట్ లో ఉంటే మెరుపులే.. నటి కామెంట్స్ వైరల్?

మాస్ మహారాజ రవితేజ కెరియర్ ఇండస్ట్రీలో పూర్తిగా డౌన్ అయిన సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ ద్వారా తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వర్ రావువంటి సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా అతిథి పాత్రలో సందడి చేయనున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సినిమాలో నటించిన రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆమె ఈ సినిమా గురించి హీరో రవితేజ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళంలో నటించిన కర్ణన్' సినిమా చూసి డైరెక్టర్ శరత్ నాకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి వివరించారు.

"""/"/ ఇకపోతే ఒక భాషలో సినిమా ద్వారా పరిచయం అవుతున్న సమయంలో సరైన కథ బలమైన పాత్ర కోసం ఎదురుచూస్తాము నాకు ఈ సినిమాలో అలాంటి పాత్ర లభించిందని ఈ సినిమాలో ఆమె మాలిని అనే పాత్రలో కనిపిస్తాననీ తెలిపారు.

ఇక ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు ఇక రవితేజ గురించి మాట్లాడుతూ ఆమెను నార్త్ ఇండస్ట్రీలో పెరిగినప్పటికీ రవితేజ సినిమాలు హిందీలో డబ్ అయినా సినిమాలను చూసేదాన్ని అంటూ తెలిపారు.

ఇక రవితేజ ఎంతో ఆక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారని, రవితేజ మాస్ హీరో మాత్రమే కాకుండా ఆయన స్టార్ అయినప్పటికీ సెట్లోకి వస్తే సెట్ మొత్తం ఎనర్జిటిక్ గా మారిపోతుందని ఆయన చిన్న ఆర్టిస్టుల నుంచి పెద్దవారి వరకు అందరితో సమానంగానే ఉంటారని తెలిపారు.

రవితేజ కనక సెట్ లో ఉంటే సెట్ మొత్తం మెరుపులా ఉంటుందని ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ వారం రిలీజ్ కానున్న క్రేజీ ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే.. కల్కి వల్లే అలా జరిగిందా?