Poonam Kaur : సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన పూనమ్… పొలిటికల్ హీట్ పెంచేసిందిగా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) పరిపాలన విధానం పై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

ఇలా ముఖ్యమంత్రిగా ఈయన సరికొత్త విధానాలను అమలుపరిచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడ్డారని ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేశారని ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా కరోనా ( Corona ) సమయంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

కానీ ఏపీ మాత్రం ప్రజలకు ఒకవైపు కట్టుదిట్టమైన భద్రత చర్యలు వైద్య సేవలను అందిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ వచ్చారు.

"""/" / ఇలా కరోనా సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చేసినటువంటి పనులను ప్రశంసిస్తూ తాజాగా సినీనటి పూనమ్ కౌర్ ( Poonam Kaur ) సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కోవిడ్ మహామ్మారి విజృభించిన సమంయలో చేనేత కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని, వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్వీట్ చేసింది.

చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పని చేసే ఓ కార్యకర్తగా చెబుతున్నాను.ఇది చాలా గొప్ప విషయమని ఈమె ముఖ్యమంత్రి పై ప్రశంసల వర్షం కురిపించారు.

"""/" / ఈ విధంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ ట్వీట్ వైసిపి అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు.

త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఈమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పాలి.

ఈమె పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా గత కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సీఎం జగన్ పట్ల ప్రశంసలు కురిపించడంతో ఇది వైరల్ అవుతుంది.

19వేల అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై స్కీయింగ్.. వీడియో చూస్తే..!