Kavitha , NTR : ఎన్టీఆర్ అలా అనేసరికి అందరి ముందే ఏడ్చేసాను : కవిత

కవిత( Kavitha ).తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం హీరోయిన్ గా పరిచయం అయింది కవిత.

దర్శకుడు కే విశ్వనాథ్( Directed By K Vishwanath ) దర్శకత్వంలో వచ్చిన సిరి సిరి మువ్వ అనే సినిమాతో తొలిసారిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ప్రస్తుతం సినిమాలతో కాకుండా రాజకీయాలతో బిజీగా ఉన్న కవిత తన జీవితంలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది.

ముఖ్యంగా తన అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే అంటూ చెబుతున్న కవిత ఆయన వల్ల ఓసారి కన్నీరు పెట్టుకున్నట్టుగా కూడా చెప్పారు.

మరి కవిత, ఎన్టీఆర్ మధ్య జరిగిన సంఘటన ఏంటి ? ఎందుకు కన్నీరు పెట్టుకుంది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

"""/" / కవిత మద్రాస్ లో టీ నగర్ లో ఒక పార్కు దగ్గర ఉండేవారు.

పార్కు ఒకవైపు కవిత ఇల్లు ఉంటే మరొకవైపు ఎన్టీఆర్( NTR ) గారి ఇల్లు ఉండేది.

ఆయన సందర్శించడానికి తెల్లవారు జామున నుంచే ఎంతో మంది పడిగాపులు కాసేవారు బస్సుల్లో జనాలు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేవారు.

తిరుపతికి దర్శనానికి వచ్చినట్టుగా ఎన్టీఆర్ ముందు కూడా వందల మంది బస్సుల్లో రావడం అప్పట్లో పెద్ద సంచలనం చెప్పాలి.

ఇక కవిత తల్లికి ఎన్టీఆర్ కి మంచి స్నేహం ఉండేది.ఆ స్నేహం కొద్ది కవితను ఓసారి ఎన్టీఆర్ గారికి పరిచయం చేశారు.

దాంతో ఆయన ఆ తన సినిమాల్లో కూడా కొన్నిసార్లు కవితను తీసుకున్నారు.నిమిత్తమై కడపకు వెళ్లిన కవితకు అక్కడ ఒక ఆశ్రమంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు అని తెలిసి వెళ్లారు.

"""/" / కవిత అక్కడికి వెళ్లేసరికి ఎన్టీఆర్ మెగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు దాంతో ఆయనను పలకరించకుండా అలాగే ఎదురుచూస్తూ ఉన్నారు.

అంతలో హరికృష్ణ( Harikrishna ) వచ్చి నాన్నకు దండం పెట్టండి అంటూ సూచించారు.

ఆయన చెప్పగానే కవిత ఎన్టీఆర్కు దండం పెట్టారు.అయితే దగ్గరికి వచ్చిన ఎన్టీఆర్ ఏంటి కవిత దండం పెట్టడం కూడా తెలియని తెలియడం లేదా అంటూ అనేసరికి అందరి ముందే బోరున విలపించారట కవిత.

కవిత, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అనేక సినిమాలు వచ్చే విజయాలు సాధించాయి.

అరవింద ఫుల్ రన్ కలెక్షన్లను ఒక్కరోజులో సాధించిన దేవర.. షేర్ కలెక్షన్లు ఎంతంటే?