మిస్ క్యారేజ్.. పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. నటి కామెంట్స్ వైరల్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి కరుణ భూషణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది కరుణ.

తెలుగులో ఈమె పసుపు కుంకుమ, మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, నువ్వా నేనా, అభిషేకం, నాతిచరామి వంటి పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కరుణ భూషణ్.

కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటంచాను.

ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్ళు పూర్తి అయ్యింది.మా అమ్మది బాంబే.

నేను పుట్టి పెరిగింది,అంతా హైదరాబాద్‌లోనే.నేను తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను.

అతడు బాలీవుడ్‌ డైరెక్టర్‌.2007లో నేను అతడ్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాను.

మాకొక అబ్బాయి.తర్వాత ఒకసారి మిస్‌క్యారేజ్‌ అయింది.

అప్పుడు ఒక సీరియల్‌ కూడా మానేశాను.అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నటిస్తున్నాను.

నా తొలి సినిమా ఆహా. """/"/ 30కి పైగా సినిమాల్లో నటించాను.

నటించకపోయుంటే డాక్టర్‌ అయ్యేదాన్ని.నేను బాగా నమ్మిన కొందరు నాకు హ్యాండిచ్చారు.

అప్పటినుంచి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని అర్థమయింది.ఈ మధ్యకాలంలో స్వీట్‌ మెమొరీస్‌ అంటే మా ఆయన నాకు ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌ గిఫ్టిచ్చాడు.

అతడికి ఈ ఫోన్‌ గిఫ్టిద్దామని హైదరాబాద్‌ అంతా తిరిగాను.ఎక్కడా దొరకలేదు.

చివరికి అతడే నాకది గిఫ్ట్ గా ఇచ్చాడు అని నవ్వుతూ తెలిపింది కరుణ.

అది నిజంగా సర్‌ప్రైజ్‌.ఆ తర్వాత మా పెళ్లిరోజుకు నేను కూడా ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌ బహుమతిగా ఇచ్చాను అని చెప్పుకొచ్చింది నటి కరుణ.

కాగా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆ పలు సీరియల్స్ లో సపోర్టింగ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

వావ్, 60 లక్షల విలువైన గిఫ్ట్స్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన దుబాయ్ మిలియనీర్..!