అమ్మ చెప్పిన పనే చేస్తున్నా.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్..?

తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో అద్భుతమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీదేవి ఊహించని విధంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుండగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీకి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.జాన్వీ శ్రీదేవి జీవించి ఉన్న సమయంలో చెప్పిన మాటలను, కీలక విషయాలను పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు.

అమ్మ చెప్పిన మాటలే తనను నడిపిస్తున్నాయని జాన్వీ కపూర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అమ్మ ఏ విధంగా నడుచుకోవాలో ఇండస్ట్రీలో ఏ విధంగా మెలగాలో చెప్పిందని జాన్వీ కపూర్ వెల్లడించారు.

ఇతరులపై ఆధారపడని మహిళలు తనకు ఇష్టమని జాన్వీ కపూర్ అన్నారు. """/"/ తనకు ఇతరులపై ఆధారపడని వాళ్లే స్పూర్తి అని జాన్వీ వెల్లడించారు.

ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా గుర్తింపును తెచ్చుకోవాలని అమ్మ చెప్పిందని తాను అమ్మ చెప్పిన పనే చేస్తున్నానని జాన్వీ కపూర్ అన్నారు.

రాబోయే రోజుల్లో కూడా తాను అమ్మ చెప్పిన మాటలనే ఫాలో అవుతానని జాన్వీ అన్నారు.

ఇష్టమైన వాళ్ల గురించి ఎదురైన ప్రశ్నకు జాన్వీ సారా అలీఖాన్ తో పాటు అలియాభట్ పేర్లను సమాధానంగా చెప్పారు.

"""/"/ కొన్ని విషయాల్లో చెల్లి ఖుషీ కపూర్ కూడా తనకు స్పూర్తిగా నిలుస్తుందని జాన్వీ కపూర్ అన్నారు.

దఢక్ అనే సినిమాలో జాన్వీ నటించగా తన ఫస్ట్ మూవీ చూడకుండా తన తల్లి మృతి చెందారని ఆ బాధ లైఫ్ లాంగ్ తనను వెంటాడుతుందని ఆమె పేర్కొన్నారు.

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో జాన్వీ పేరు వినిపిస్తుండగా ఆ సినిమాలో ఆమె నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ దిద్దుకోలేని తప్పు చేశారా.. కొత్త ఆఫర్లు రావడం కష్టమేనా?