సర్ఫ్ తో స్నానం చేశా.. టాయిలెట్ వాటర్ తో కాఫీ తాగా.. నటి కన్నీటి కష్టాలివే!

కొంతమంది నటీమణుల కష్టాల గురించి వింటే సాధారణ ప్రేక్షకులు సైతం కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు.

ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఒకరైన క్రిసాన్ పెరారీ( Chrisann Pereira ) తాజాగా దుబాయ్ లో ఒక కేసులో అరెస్ట్ అయ్యారు.

తాజాగా జైలు నుంచి విడుదలైన ఈ నటి అక్కడ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

దాదాపుగా 26 రోజుల పాటు తాను ప్రత్యక్ష నరకం అనుభవించానని ఆమె తెలిపారు.

జైలులో ఉన్న సమయంలో నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు.టాయిలెట్ వాటర్ తో చేసిన కాఫీ తాగానని, టైడ్ సర్ఫ్ తో స్నానం చేశానని క్రిసాన్ పెరారీ చెప్పుకొచ్చారు.

జైలులో కనీసం నాకు పెన్ కూడా దొరకలేదని ఆమె కామెంట్లు చేశారు.ఒక పెన్ నాకు దొరకడానికి ఏకంగా 20 రోజుల సమయం పట్టిందని క్రిసాన్ పెరారీ అన్నారు.

అలాంటి నరకం నా లైఫ్ లో ఎప్పుడూ రాకూడదని భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.

"""/" / మన శత్రువులకు సైతం ఇలాంటి గతి పట్టకూడదని నేను అనుకుంటానని క్రిసాన్ పెరారీ చెప్పుకొచ్చారు.

షార్జా జైలు( Sharjah Jail ) నుంచి విడుదలైన ఈ నటి చెప్పిన కన్నీటి కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవువుతున్నారు.

సడక్2, బాట్లా హౌస్ సినిమాల ద్వారా ఈ నటి పాపులర్ కావడం జరిగింది.

ఇద్దరు వ్యక్తులు ఈ నటిని ఈ కేసులో ఇరికించారని సమాచారం అందుతోంది. """/" / ఈ నటి అనుభవించిన తరహా కష్టాలు మరెవరికీ రాకూడదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్రిసాన్ పెరారీ కెరీర్ పై ఫోకస్ పెట్టాలని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రముఖ నటికి ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

రూ.12 లక్షలతో తీస్తే రూ.2 కోట్లు కలెక్ట్ చేసిన బాపు సినిమా.. ఏదంటే..??