తల్లి అయిన రష్మిక మందన్నా.. ఛార్మీ పోస్ట్ తో లీక్..?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ లో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక ఒకరని చెప్పవచ్చు.

తెలుగులో రష్మిక చేతిలో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఉన్నాయి.రష్మిక తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

"""/"/ అయితే నటి ఛార్మీ కౌర్ తాజాగా రష్మిక మందన్నా గురించి ఒక పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ముంబైలో ఉన్న ఛార్మీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఛార్మీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పెట్స్ ను ఎంతగానో ఇష్టపడే ఛార్మీ తాజాగా రష్మిక తన దగ్గరకు వచ్చారని తెలిపారు.

"""/"/ ఆ తర్వాత ఛార్మీ రష్మికకు శుభాకాంక్షలు చెప్పారు.తల్లివి అయినందుకు శుభాకాంక్షలని మీ బిడ్డ ఎంతో బాగుందని రష్మిక పెట్ ను చూపిస్తూ చెప్పారు.

ఆ తరువాత ముంబైకి వచ్చినందుకు రష్మికకు ఛార్మీ వెల్ కమ్ చెప్పారు.ఛార్మీ పెట్టిన పోస్ట్ కు రష్మిక స్పందిస్తూ ఇకపై నన్ను ఎప్పుడూ అక్కడే చూడాల్సి వస్తుందని ఆమె అన్నారు.

రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటే మాత్రం ఆమెకు ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రష్మిక మాత్రం పారితోషికం కంటే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.బాలీవుడ్ లో ఆఫర్లు పెరిగితే రష్మిక టాలీవుడ్ కు గుడ్ బై చెబుతారేమో చూడాల్సి ఉంది.

నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు… ట్రోల్స్ పై స్పందించిన అనిల్ రావిపూడి!