అలా నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేసిన నటి ఆండ్రియా.. కానీ చివరికి?

ప్రముఖ కోలీవుడ్ నటి ఆండ్రియా జెరెమియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆండ్రియా నటిగా మాత్రమే కాకుండ సింగర్ గా కూడా మంచి గుర్తింపు పొందింది.

నాగ చైతన్య, సునీల్ నటించిన తడాఖా సినిమా ద్వార టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ఈ సినిమాలో తమన్నా మొదటి హీరోయిన్ నటించగా , సునీల్ కి జోడీగా సెకండ్ హీరోయిన్ గా ఆండ్రియా నటించింది.

అయితే కార్తీక్ నటించిన యుగానికి ఒక్కడు సినిమా తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం వల్ల ఈ సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయం అయింది.

తడాఖా సినిమా ద్వార తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉండగా ఇటీవల ఈ అమ్మడికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తరచు బోల్డ్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో నిలుస్తుంది.

గతంలో కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు వారిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

ఇదిలాఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు నగ్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

ఆండ్రియా తాజాగా పిశాచి 2 సినిమాలో నటించింది.గతంలో వచ్చిన పిశాచి సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. """/" / ఇప్పటికే సినిమా షూటింగ్ పనులు పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆగష్టు 31వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో ఆండ్రియా పూర్తి నగ్నంగా నటించింది.అయితే ఈ సినిమాలో నగ్నంగా నటించినందుకు ఈ అమ్మడు భారీగా పారితోషికం డిమాండ్​ చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం ఆండ్రియా రూ.1.

50 కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.అయితే నిర్మాతలు రూ 1.

25 కోట్లకు ఫిక్స్ చేశారు.అయితే ఈ సినిమాలో ఆండ్రియ బోల్డ్ గా నటించిన సన్నివేశాలు ఏవి లేవని కేవలం నగ్నంగా ఫోటోషూట్ మాత్రమే చేసామని దర్శకుడు వెల్లడించాడు.

అనంత్ అంబానీ రిసెప్షన్ ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?