చంద్రబాబు జూమ్ మీటింగ్స్ కన్నీళ్లు పెట్టుకున్న అంటున్న దివ్య వాణి!

తెలుగు సినీ నటి దివ్యవాణిబాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈమె కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది.

ఈమె సినీరంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా తన వంతు బాధ్యతలను చేపట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు జూమ్ మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకున్నాంటూ ఆసక్తికరంగా విషయాలు తెలిపింది దివ్యవాణి.

టిడిపి అధికార ప్రతినిధి బాధ్యతలు తీసుకుంటున్న దివ్యవాణి కొన్ని విషయాలు తెలుపుతూ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల ని ఫేస్ చేస్తూ బయట వాళ్లను ఎదుర్కోవడమే నిజమైన రాజకీరమని తనకు కరోనా తర్వాతే అర్థమైందని తెలిపింది.

ఇటీవల ఆమె పార్టీ మారుతున్న వార్తలు రావడంతో దాని పై స్పందిస్తూ దేనికైనా సమయం రావాలని అంటుంది.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2021/02/chandrababu-zoom-meeting-yavani-tdp-leader-ap-poltics-tdp!--jpg"/ ప్రస్తుతం ఆమె టిడిపి పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ, తనకు రాజకీయాలు చేయడం చేత కాదంటూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానంటూ, ఈ షాట్ పొలిటికల్ జర్నీ లో చంద్రబాబు ఉ తనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారని తెలిసింది.

చంద్రబాబు గురించి గొప్పగా చెబుతూ అటువంటి వ్యక్తి నుండి చాలా నేర్చుకోవచ్చని తెలిపింది.

చంద్రబాబు తరచుగా జూమ్ మీటింగులు పెడతారంటూ, అవి తమకు కొత్త గా ఉండటంతో వాటి గురించి చంద్రబాబుతో నేరుగా చెప్పేస్తాదట‌.

అక్కడ స్త్రీలకు మంచి గుర్తింపు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా జూమ్ మీటింగ్ లో మాత్రం 500 మంది ఉంటే కనీసం ఇద్దరు మహిళలకు కూడా మాట్లాడే అవకాశం ఉండదని తెలిపింది.

కానీ తనకు మాట్లాడాలని ఎంతో ఆసక్తి ఉండేదట.తను ఒకవేళ మరుసటి రోజు మీటింగ్ అని అనగానే ముందు రోజు నుంచి అన్ని ప్రిపేర్ అవుతుందట.

అంతేకాకుండా ఎలాంటి తప్పులు మాట్లాడకుండా తరచుగా ప్రాక్టీస్ చేస్తోందట.అంత కష్టపడి ప్రిపేర్ అయితే కనీసం కాల్ కనెక్ట్ కూడా చేయరని తెలిపింది.

పోని ఒక్కసారి కాకుంటే మరొక్కసారి కనెక్ట్ చేస్తారు అనుకుంటే అది కూడా లేదని తెలుపుకొచ్చింది.

అలా ఎన్నోసార్లు తను బాధ పడేదట.ఇలా ఎన్నో సందర్భాల్లో తను సెన్సిటివ్ గా ఉండటం తో చాలాసార్లు ఏడ్చానని చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్?