చెత్తగా ఉంటే అన్ని కోట్లు ఎలా రాబడుతుంది.. ట్రోలర్స్ పై అలియా సెటైర్స్!

బాలీవుడ్ లో ఇటీవలే మరొక పెద్ద సినిమా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.

రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర.

ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు.

మౌని రాయ్ ఈ సినిమాలో విలన్ గా నటించింది.చాలా రోజులుగా బాలీవుడ్ లో సరైన సినిమాలు రిలీజ్ కాని కారణంగా ఈ సినిమాపై అందరు హోప్స్ పెట్టుకున్నారు.

ఈ సినిమా అయినా లాభాలు తెచ్చుకుని బాలీవుడ్ పరువు నిలుపుతుందని ఆశ పడ్డ అందరికి మరోసారి నిరాశనే ఎదురయ్యింది.

అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి షో నుండే నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.

అంత బడ్జెట్ దండగగా పెట్టారంటూ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి.అయితే ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్లు సాధించి ఇప్పటి వరకు 250 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో బాలీవుడ్ కు కాస్త ఊపిరి అందించిన సినిమాగా అయితే నిలిచింది.

"""/"/ అయినా కూడా ట్రోల్స్ ఆగక పోలవడంతో తాజాగా ఈ ట్రోల్స్ పై అలియా స్పందిస్తూ తనదైన శైలిలో స్వీట్ వార్ణింగ్ ఇచ్చింది.

''సినిమాపై వస్తున్న నెగిటివ్ వ్యాఖ్యల గురించి మా టీమ్ అస్సలు ఆలోచించ కూడదని నిర్ణయం తీసుకుంది.

ప్రతీ ఒక్కరు తమ అభిప్రాయాన్ని చెప్పడం తప్పు కాదు.వాటిని మేము ఎప్పుడు గౌరవిస్తాం.

అయితే సినిమా అంత చెత్తగా ఉంటే 150 కోట్ల మార్క్ ను దాటేది కాదు.

ఆ నెంబర్ నే చెబుతుంది సినిమా ఎలా ఉంది అనేది' అంటూ అలియా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వారానికి 2 సార్లు ఉడికించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందొచ్చో తెలుసా?