శ్రీనువైట్లపై ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. ఎకరం విలువ చెయ్యడంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో శ్రీనువైట్ల ఒకరు.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీనువైట్ల విష్ణుతో తెరకెక్కించి ఢీ అండ్ ఢీ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

<దూకుడు, బాద్ షా సినిమాల తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

నటుడు, నిర్మాత, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నీకోసం సినిమాకు మొదట వేరే నిర్మాతలు అని కొంతభాగం షూటింగ్ అయిన తర్వాత వాళ్లు ఆ ప్రాజెక్ట్ ను ఆపేశారని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వల్ల ఆ సినిమా ఆగిపోయిందని వల్లభనేని జనార్ధన్ చెప్పుకొచ్చారు.శ్రీనువైట్ల తొలి సినిమా రాజశేఖర్ తో ఆగిపోయిందని రెండో సినిమా నీకోసంకు కూడా ఆగిపోయే పరిస్థితులు ఎదురయ్యాయని వల్లభనేని జనార్ధన్ పేర్కొన్నారు.

ఆ సమయంలో శ్రీనువైట్ల అప్పటివరకు తీసిన సన్నివేశాలను చూపించారని యాక్సిడెంటల్ గా చూసి ఆ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి ముందుకు వచ్చానని వల్లభనేని జనార్ధన్ తెలిపారు.

"""/" / మొదట ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎక్కువ పారితోషికం అడగడంతో నేను లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేనని చెప్పానని జనార్ధన్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆర్పీ పట్నాయక్ ను తీసుకున్నామని జనార్ధన్ తెలిపారు.శ్రీనువైట్లను నేను పరిచయం చేశానని ఆ సినిమాను రామోజీరావు దగ్గరకు తీసుకెళ్లి విడుదల చేయించానని జనార్ధన్ చెప్పుకొచ్చారు.

"""/" / శ్రీనువైట్ల పది కోట్ల డైరెక్టర్ కావచ్చని తన ల్యాండ్ మద్రాస్ లో ఏకంగా 12 కోట్ల రూపాయలు అని వల్లభనేని జనార్ధన్ తెలిపారు.

రాఘవేంద్ర రావు ప్రొడక్షన్ లో ఒకరోజు షూటింగ్ అని పిలిచారని కానీ తర్వాత సమాచారం ఇవ్వకపోవడంతో తాను సీరియస్ అయ్యానని వల్లభనేని జనార్ధన్ చెప్పుకొచ్చారు.

వైసీపీ లో దడ పుట్టిస్తున్న అరెస్ట్ లు ? నెక్స్ట్ ఎవరో ?