చంపేస్తాం అంటూ నటికి బెదిరింపుల లేఖ.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకుని స్వర భాస్కర్.

అంతే కాకుండా ఈమె పలు సామాజిక అంశాలపై కూడా స్పందింస్తు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా నటి స్వర భాస్కర్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది.

మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న తన నివాసానికి స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా లేఖను పంపారు.

అయితే ఆమె ఆ లేఖను ఓపెన్ చూడగా బెదిరింపు అందులో ఆమెను చంపేస్తాము అంటూ బెదిరింపు లేఖ రాశారు.

ఈ లేఖ పై నటి స్వర భాస్కర్‌ వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది.నటి స్వర భాస్కర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీర్‌ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇకపోతే ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సోషల్‌ తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది.

"""/"/ స్వర భాస్కర్‌ 2017లో వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.తనను జైలు నుంచి విడిపించాలంటూ బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ట్వీట్‌ చేసింది.

దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా నటి స్వర భాస్కర్ కు చంపేస్తాము అంటూ లేఖ ఎవరు రాశారు అనేది తెలియాల్సి ఉంది.

ఇదే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Mudragada Padmanabham : ‘ముద్రగడ ‘ అసలు టార్గెట్ ఆయనేనా ? జగన్ అప్పగించిన బాధ్యత అదేనా ?