అంతకు మించిన పేమెంట్ లేదంటున్న నవీన్ పోలిశెట్టి.. ఏమైందంటే?

అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జాతి రత్నాలు'.ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు థియేటర్ లో విడుదలయ్యింది.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఈరోజు అసలైన పండుగ అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా గురించి నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.

తాను చేసే ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉందో లేదో చేసుకుంటానని తెలిపాడు.

అన్ని రకాల పాత్రలు, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.ఇక సాధారణంగా గొప్పవారిని జాతి రత్నాలు అంటారని కానీ మా జాతి రత్నాలు సెటైరికల్ సినిమా అని తెలిపాడు.

ఇదిలా ఉంటే తనకు అంతకు మించిన పేమెంట్ లేదంటున్నాడు. """/"/ ఇక ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి వస్తే తనకు అంతకుమించిన పేమెంట్ లేదని చెప్పుకొచ్చాడు.

తాను ముంబైలో ఉన్నప్పుడు తన వీడియోలు నాగీకి పంపేవాడట‌.తనలాంటి కొత్తవారికి ఇలాంటి నిర్మాతలు అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఓ నవీన్ ఉంటాడని తెలిపాడు.

ఇదిలా ఉంటే ఓ ప్రేక్షకుడు తనకు యాక్సిడెంట్ అయిందని లేకపోతే జాతిరత్నాలు సినిమా థియేటర్ లో పదిసార్లు చూసేవాడిని ట్వీట్ చేశాడని తెలిపాడు.

ఇక అతనికి సినిమా చూపిస్తే, హిలేరియస్ గా ఉందని చెప్పాడని తెలిపాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే సినిమా విడుదల కాగా థియేటర్ల నుంచి ప్రేక్షకులు నిజంగానే నవ్వుతూ బయటికి వస్తున్నారు.

అంతేకాకుండా ఈ సినిమా మంచి పబ్లిక్ టాక్ అందుకోగా మంచి హిట్ సాధించిందని అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా విజయం వల్ల నవీన్ పొలిశెట్టి కు మరిన్ని ఆఫర్లు వస్తాయని ఊహించవచ్చు.

రోజూ నైట్ ఈ ఐ మాస్క్ వేసుకుంటే డార్క్ సర్కిల్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు!