మనుషులను బట్టి బాలయ్య చేయి జాడిస్తాడు.. జోష్ రవి కీలక వ్యాఖ్యలు?

నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రవికి ఆ సినిమా తర్వాత అవకాశాలు అంతకంతకూ పెరిగాయి.

జోష్ సినిమాకు ముందే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికి జోష్ ద్వారా వచ్చిన గుర్తింపు కెరీర్ కు ప్లస్ అయింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రవి తాజాగా నందమూరి బాలకృష్ణ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

బాలయ్య బాబు గారూ ఈయన మనస్సు నవ్వి రెండూ స్వచ్చం అని జోష్ రవి పేర్కొన్నారు.

అయితే ఈ పోస్ట్ గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ చిరంజీవిని తప్పించి బాలయ్యను మునగచెట్టు ఎక్కించడంలో అర్థం ఏమిటని అడగగా నాన్నను పొగుడుతున్నానంటే అమ్మను తప్పించేంత దరిద్రపు స్థితిలో తాను లేనని జోష్ రవి అన్నారు.

ఎవరి బలం వారిదని సినిమా అంటేనే మా కుటుంబమని జోష్ రవి చెప్పుకొచ్చారు.

"""/"/ బాలయ్య చెయ్యి జాడింపు గురించి చెప్పు బ్రో అని ఒక నెటిజన్ అడగగా నోరు జాడింపు మనుషులను బట్టే బాలయ్య చెయ్యి జాడింపు ఉంటుందని జోష్ రవి చెప్పుకొచ్చారు.

కొందరు హీరోలు వెనుక చెయ్యి విధిలిస్తారని బాలకృష్ణ మాత్రం అక్కడే చెయ్యి జాడిస్తాడని తప్పేముందని జోష్ రవి ప్రశ్నించారు.

హీరోలలో బాలయ్య అంత మంచి మనుషులు తక్కువ అని జోష్ రవి అన్నారు.

మన పద్ధతిని బట్టి బాలయ్య రియాక్షన్ ఉంటుందని ఆయన బంగారం అని జోష్ రవి చెప్పుకొచ్చారు.

"""/"/ మరి కొందరు బాలయ్య అభిమానులు బాలయ్యకు ప్రేమైనా కోపమైనా దాచుకోవడం రాదని కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్యపై ఉన్న అభిమానాన్ని జోష్ రవి చాటుకున్నారు.ప్రస్తుతం బాలయ్య అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉంది.

అలా పిలిస్తే జక్కన్నకు ఎంతో ఇష్టమట.. కీరవాణి పిల్లలు రాజమౌళిని అలా పిలుస్తారా?