అరటి సాగును( Banana ) ఆశించే పనామా కుళ్ళు తెగులు ఒక ఫంగస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.
భూమి లోపల కొన్ని దశాబ్దాల పాటు ఈ ఫంగస్ జీవించే ఉంటుంది.అరటి మొక్క వేర్ల ద్వారా చెట్టు లోపలికి ప్రవేశిస్తుంది.
ఈ ఫంగస్ నీటి ద్వారా, పనిముట్ల ద్వారా, పాదరక్షల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది.
ఉష్ణోగ్రత పెరిగితే ఈ తెగుల వ్యాప్తి కూడా పెరుగుతుంది.ఈ తెగుళ్ల ప్రధాన పాత్ర ఏమిటంటే పోషకాలు అందించే కణజాలాలను ఎండిపోయేటట్టు చేయడం.
అలా చేస్తే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.తొలి దశలో ఈ తెగులను అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవలసిందే.
"""/" /
అరటి చెట్లు ముదురు పసుపు రంగులోకి మారి వాడిపోతే ఆ చెట్లకు తెగులు సోకినట్లు నిర్ధారించుకోవాలి.
పసుపు రంగులోకి మారిన ఆకులు క్రమంగా చీలిపోవడం, ఎండిపోవడం జరుగుతుంది.మరి ఈ తెగులు ఎలా నివారించాలో చూద్దాం.
మార్కెట్లో అధికంగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.కాబట్టి సర్టిఫైడ్ కంపెనీ నుంచి తెగులు నిరోధక మొక్కల( Pest Resistant Plants ) రకాలను ఎంచుకోవాలి.
పొలంలో నీరు నిల్వ ఉండకుండా నీటిపారుదల వ్యవస్థను చక్కగా ఏర్పాటు చేసుకోవాలి.తెగులు సోకిన మొక్కలను పంట నుండి వేరు చేసి వెంటనే కాల్చి నాశనం చేయాలి.
పొలంలో ఉపయోగించే పనిముట్లను హైపోక్లోరైడ్ తో శుద్ధి చేయాలి. """/" /
ఒకవేళ అరటి పంటకు ఈ తెగులు సోకినట్లయితే, ఓ మూడు సంవత్సరాల పాటు తెగులు సోకిన భూమిలో అరటి పంట వేయకుండా ఇతర పంటలు వేసుకోవాలి.
సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను నివారించాలి అంటే ట్రైకోడెర్మా వీరిడే( Trichoderma ) లాంటి ఫంగస్ లేదంటే సుడోమోనాస్ ఫ్లోరెసిన్స్ లాంటి బ్యాక్టీరియా జీవ నియంత్రణ పదార్థాలు ఉపయోగించి ఈ తెగులను అరికట్టవచ్చు.
రసాయన పద్ధతిలో కార్బమ్ డిజమ్ 50.0wp తో మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ తెగులను అరికట్టవచ్చు.
ఏం మాయ చేసావే ఎప్పటికీ ప్రత్యేకమే… మొదటి సినిమాని గుర్తు చేసుకున్న సమంత!