మిరపలో తామర పురుగుల నివారణకు చేపట్టాల్సిన చర్యలు..!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న వాణిజ్య పంటలలో మిరప పంట( Chilli Cultivation ) కూడా ఒకటి.
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో 6.7 లక్షల ఎకరాలలో మిరప సాగు అవుతోంది.
మిరప పంటలో మొదటి నుంచి సస్యరక్షక పద్ధతులు పాటిస్తూ ఏవైనా చీడపీడలు లేదా తెగుళ్లు పంటను ఆశిస్తే తొలిదశలోనే అరికడితే అధిక దిగుబడి( High Yield ) పొందవచ్చు.
అలా కాకుండా తొలిదశలో అరికట్టకపోతే ఇక తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.మిరప పంట దిగుబడి అనేది వాతావరణ పరిస్థితులపై అధికంగా ఆధారపడి ఉంటుంది.
ఈ పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.చీడపీడల విషయానికి వస్తే మిరప పంటకు రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, తామర పురుగులు వల్ల అధిక నష్టం వాటిల్లుతుంది.
తొలి దశలోనే ఈ పురుగులను అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు. """/" /
వేసవికాలంలో లోతు దుక్కిలు దున్నడం వల్ల భూమిలో ఉండే ఫంగస్, వైరస్ లకు సంబంధించిన అవశేషాలు సూర్యరశ్మి( Sunlight ) వలన చనిపోతాయి.
ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పొలం నుండి పూర్తిగా శుభ్రం చేయడం వల్ల వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉండదు.
"""/" /
మిరప పంటను ఆశించే తామర పురుగులు అనేవి చాలా చిన్నవిగా, సున్నితంగా ఉండి ఊదారంగులో చీలిన రెక్కలతో ఉంటాయి.
ఈ పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా చేరి ఆకు రసాన్ని పీల్చడం వల్ల ఆకు మెలి తిరిగి, అంచుల వెంబడి పైకి ముడుచుకుపోతుంది.
ఈ పురుగులను అరికట్టాలంటే ఎసిటామిప్రిడ్( Acetamiprid ) 20శాతం ఎస్.పి 0.
2గ్రా లేదా డైఫెన్ థైయూరాన్ 1.5గ్రా ను ఒక లీటరు నీటిలో కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
తొలి దశలో ఈ పురుగులను అరికడితే దిగుబడి తగ్గే అవకాశం ఉండదు.