వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే కాండం కుళ్ళు తెగుల నివారణకు చర్యలు..!

వేరుశనగ( Groundnut ) అనేది నూనె గింజల పంటలో ప్రధానమైన పంట.రబీ, వేసవిలో ఆరుతడి పంటగా నీటి సౌకర్యం ఉండే పొలాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.

ఈ వేరుశనగ పంటలో మంచి ఆదాయం ఉండడంతో పాటు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.

పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ సస్యరక్షక చర్యలు తీసుకోవడం వల్ల మంచి దిగుబడి సాధించి మంచి లాభాలు పొందవచ్చు.

"""/" / రబీ లో వేరుశనగ పంటను సాగు చేస్తే.పంట పూత దశలో నుండి కాయలు ముదిరే దశ వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఒకవేళ కాండం కుళ్ళు తెగుళ్లు పంటను ఆశిస్తే.తొలి దశలోనే ఈ తెగుళ్లను అరికట్టడంలో విఫలం అయితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సిందే.

ఈ తెగులను పంట పొలంలో ఎలా గుర్తించాలంటే.వేరుశనగ పంట విత్తిన 70 రోజుల తర్వాత ఈ తెగులు పంటను ఆశించే అవకాశం ఉంది.

మొక్క యొక్క కాండం, ఊడలు మరియు కాయలకు ఈ తెగులు సోకుతుంది.భూమి పైభాగాన ఉన్న కాండం మీద తెల్లటి బూజు తెరలుగా ఏర్పడి, ఆ తర్వాత ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలింద్రసిద్ధ బీజాలు ఏర్పడతాయి.

"""/" / వేసవిలో లోతు దుక్కులు( Summer ) దున్నుకొని, ఇతర పంటల అవశేషాలను నేల నుండి శుభ్రం చేయాలి.

తెగులు నిరోధక ఆరోగ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను 1 గ్రామ్ కార్బండిజమ్( Carbendazim ) తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఆ తర్వాత పంట పొలంలో విత్తుకోవాలి.కాండం కుళ్ళు తెగుళ్లు ఆశించిన తొలి దశలోనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.

ఆ తర్వాత 2.5 గ్రాముల మాంకోజెబ్ ను ఒక లీటర్ నీటిలో కలిపి నాజిల్ తో నేల తడిసేటట్లు పోయాలి.

అంబానీ నుంచి జయలలిత వరకు గొప్పగా పెళ్లిళ్లు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు