ఆచార్య శాటిలైట్ రైట్స్… ఏకంగా 50 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో ప్రస్తుతం ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

భారీ బడ్జెట్ తో సౌత్ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే సినిమా మీద పోజిటివ్ బజ్ ఉంది.

మరో వైపు మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో సినిమా సక్సెస్ కి ఎలాంటి ఢోకా ఉండదని అందరూ భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచి సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం చానల్స్ మధ్య పోటీ నడుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం నిర్మాతలు ఏకంగా 50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ముందుగా 80 కోట్ల వరకు డిమాండ్ చేసిన ఎవరూ కూడా తీసుకోవడానికి ముందుకి రాలేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితిలో 50 కోట్లకి ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ రైట్స్ కోసం సన్ టీవీ, జీ-గ్రూప్ మధ్య చర్చలు నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈరెండు చానల్స్ లో ఎవరో ఒకరికి డిమాండ్ బట్టి రైట్స్ ని ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు.

మరో వైపు థీయాట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోయిందని తెలుస్తుంది.ఇక సినిమా రిలీజ్ కి ముందే దీనికి పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టే పనిలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరి అది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

రంగంలోకి నందమూరి బ్రదర్ .. నేటి  నుంచే ఎన్నికల ప్రచారం