ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ

ఏపీ సీఎం జగన్ పై( AP CM Jagan ) రాయిదాడి ఘటన కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ ను( Satish ) పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఈ మేరకు సతీశ్ ను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

అయితే రిమాండ్ లో ఉన్న నిందితుడు సతీశ్ ను ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.

కేసు విచారణలో మరిన్ని విషయాలను రాబట్టేందుకు సతీశ్ ను కస్టడీకి( Satish Custody ) ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బుల్లితెరపై ప్రభాస్ పరువు పాయే.. సలార్ మూవీ టీఆర్పీ రేటింగ్ ఇంత ఘోరమా?