గరుడ పురాణం ప్రకారం లక్ష్మీ కటాక్షం కావాలంటే.. ఈ విధంగా చేయండి..!

చాలా మంది తమకు ఎంతో ఆదాయం వచ్చినప్పటికీ కూడా నిలవడం లేదనీ, వచ్చినది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు.

అలాగే ఎంత సంపాదించినా సరే బ్యాంక్ అకౌంట్ ఖాళీగానే ఉంటుందని బాధపడుతూ ఉంటారు.

అయితే ఇలాంటి పరిహారం పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.ఈ పరిహారాలు గరుడ పురాణంలో ఉన్నాయి.

అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎప్పుడూ కూడా సంపద చూసుకొని గర్వపడకూడదు.

డబ్బున్న వాళ్ళమని ఇతరులను ఎప్పటికీ కూడా అవమానించకూడదు.అలాగే వారిని అగౌరవపరచకూడదు.

అంతేకాకుండా సంపద చూసుకొని గర్వపడే వారిపై లక్ష్మీదేవి ( Lakshmi Devi )కోపంతో వెళ్లిపోతుంది.

అందుకే లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం.అందుకే డబ్బు ఉందని అహంకారం అస్సలు పనికిరాదు.

డబ్బు గర్వంతో ఇతరులను కించపరచడం అస్సలు మంచిది కాదు.ఇక ఇంట్లో తరచుగా రామాయణం,మహా భారతం వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఇప్పటికి ఆనందం, శాంతి వెళ్లి విరుస్తాయి.

గరుడ పురాణం( Garuda Purana ) ప్రకారం ఒక వ్యక్తి తమ సామర్థ్యాన్ని బట్టి దానధర్మాలు చేయాలని చెబుతోంది.

"""/" / అయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అవసరం ఉన్నవారికి చేతి సాయం చేయడం లాంటివి చేయడం వలన పుణ్యం కలుగుతుంది.

ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు.దీని వల్ల లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది.

గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా పితృదేవతలను ఆరాధించుకోవాలి. """/" / అందుకే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానది కార్యక్రమాలు చేసి ఆ తర్వాత దేవుళ్లను పూజించాలి అని గరుడ పురాణం చెబుతోంది.

వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.అందుకే వంటగది( Kitchen Room )లోకి ఉదయం స్నానం తర్వాతే వంట చేసేందుకు ప్రవేశించాలి.

వంట గదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి సమర్పించిన తర్వాతే ప్రసాదంగా మనం స్వీకరించాలి.

ఇలా చేయడం వలన లక్ష్మీ ఆ ఇంటిని అసలు వదిలిపోదు.

మహేష్ బాబు రాజమౌళి కాంబో లో వచ్చే సినిమాలో నటించనున్న ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్…