చంద్రబాబు స్కెచ్ ప్రకారమే పుంగనూరులో గొడవ..: పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.స్కెచ్ వేసి పుంగనూరులో చంద్రబాబు గొడవ సృష్టించారని ఆరోపించారు.

టీడీపీ శ్రేణులు చేసిన దాడిలో పోలీసులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలిపారు.పుంగనూరు బైపాస్ వద్ద పోలీసులు తప్ప ఎవరున్నారని పేర్ని నాని ప్రశ్నించారు.

అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని చెప్పారు.పోలీసులపై దాడులకు పాల్పడటమే కాకుండా అల్లర్లు సృష్టించాలని చూశారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో గాయపడిన పోలీసులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.చంద్రబాబు ఏడవాలి అనుకుంటే పోలవరంలో కాకుండా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏడవాలన్నారు.

అలా అయిన కొన్ని నీళ్లు వచ్చి కృష్ణా నది అయిన నిండుతుందంటూ ఎద్దేవా చేశారు.

కృష్ణ, శోభన్‌బాబు మధ్య ఏం జరిగింది.. మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఎందుకు మానేశారు ?