ట్రాఫిక్ నియమాలు, సిగ్నల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించగలం: ట్రాఫిక్ ఎస్.ఐ రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని బడ్స్ అండ్ ఫ్లవర్స్ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు "రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాస్సేస్ " లో భాగంగా ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్,ఎంవీ యాక్ట్ ,హెల్మెట్, వాహనాల చట్టాలు, మొదలగు అంశాల మీద ట్రాఫిక్ ఎస్.

ఐ రాజు ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్.

ఐ రాజు మాట్లాడుతూ.విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాల మీద ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలని తద్వారా రోడ్ ప్రమాదాలను నియంత్రించ వచ్చు అనే ఆలోచనలో జిల్లా ఎస్పీ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించడం జరుగుతున్నారు.

విద్యార్థిని విద్యార్థులు హెల్మెట్ వినియెగం, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై తల్లిదండ్రులకు,బంధువులకు స్నేహితులకు,తోటి వారికి అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సేఫర్ ఇండియన్ రోడ్,ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో ఓఝా,బడ్స్ అండ్ ఫ్లవర్స్ పాఠశాల సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

కొడుకు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సూపర్ స్టార్ కృష్ణ.. కానీ?