డిగ్రీ కళాశాల మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏబీవీపీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు స్థానిక పాత బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ వరకు బైకు ర్యాలీ నిర్వహించి టపాకాయలు పేల్చారు.

ఈ సందర్భంగా మారవేని రంజిత్ కుమార్ మాట్లాడుతూ తమ పదేళ్ల సుదీర్ఘ పోరాటం ద్వారా డిగ్రీ కళాశాలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందని తమ మండల విద్యార్థులకు డిగ్రీ విద్యా అందుతుందని హర్ష భావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

అదిరిపోయే లుక్ లో మోక్షజ్ఞ.. వైరల్ అవుతున్న ఫోటోషూట్ వీడియో?