ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని కొలువై ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం రోజున హనుమాన్ పెద్ద జయంతి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి రుద్రాభిషేకం అర్చన కార్యక్రమాలు ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు హనుమన్ జయంతి పురస్కరించుకొని మన గ్రామంలోని హనుమన్ దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇటి కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు తెల్లవారుజామునే ఆలయం ఖర్చు పూజలలో పాల్గొనడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు మరి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

ఇదేం పాడు పార్టీ రా బాబు.. పార్టీలో గేమ్ రూల్ విని అమ్మాయికి షాక్‌..