ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.

కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టింది.మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు తిరుగులేని మెజార్టీ సాధించారు.

బీజేపీ 104 స్థానాల్లో గెలుపు సాధించగా, 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.

గత 15 ఏళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉంటుంది.తాజాగా బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతూ ఆప్ షాక్ ఇచ్చింది.

ఆప్ ఘన విజయంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట సంబరాలు మిన్నంటాయి.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!