కరోనాతో ముగిస్తున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
TeluguStop.com
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏ సినిమా చేసిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆయన సినిమాలను తిలకిస్తుంటారు.
కాగా అమీర్ ఖాన్తో సినిమా అంటే నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించడం సర్వసాధారణం.
అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ముగింపు దశకు తీసుకొచ్చాడట.
కాగా ఈ సినిమా క్లైమాక్స్ను ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేలా చూస్తున్నాడు ఈ స్టార్ హీరో.
అయితే అమీర్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ను ఓ భయంకర వ్యాధికి సంబంధించిన బ్యాక్డ్రాప్తో తెరకెక్కించాలని తొలుత చిత్ర యూనిట్ భావించింది.
కాగా వీరికి పర్ఫెక్ట్ కాన్సెప్ట్ కరోనా వైరస్ రూపంలో లభించిందని చిత్ర యూనిట్ అంటోంది.
వారి సినిమాలో క్లైమాక్స్ పూర్తిగా కరోనా మహమ్మారి బ్యాక్డ్రాప్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అమీర్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్గా నిలుస్తుందనే విషయాన్ని చిత్ర యూనిట్ పదేపదే అంటున్నారు.
అయతే ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్గా అమీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
మొత్తానికి కరోనా వైరస్ను తమ సినిమాలో వాడుకుని క్యాష్ చేసుకోవాలని అమీర్ ఖాన్ చూస్తుండగా, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి అమీర్ ఖాన్కు కరోనా వైరస్ ఎంతవరకు లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి.
సీఎం జగన్ రేపటి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!