జబర్దస్త్ యాంకర్ పై ఆది బూతు కామెంట్స్..మరీ ఇంతలానా?

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైపర్ ఆది కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ తిరిగి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హైపర్ ఆది ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎప్పటిలాగే తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అయితే ఒక్కోసారి ఆది డబుల్ మీనింగ్ డైలాగులతో యాంకర్లపై జడ్జిలపై వేసే డైలాగులు కొన్నిసార్లు ఆయనని ట్రోలింగ్ కి గురి చేసేలా చేస్తాయి.

హైపర్ ఆది గతంలో యాంకర్ అనసూయ పై కూడా తనదైన శైలిలో సెటైర్లు వేసేవారు.

ప్రస్తుతం అనసూయ స్థానంలోకి సౌమ్యరావు అనే కొత్త యాంకర్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఆది ఈమెపై కూడా తన పంచ్ డైలాగులు డబల్ మీనింగ్ డైలాగులు వాడుతూ రచ్చ చేస్తున్నారు.

తాజా ఎపిసోడ్ లో భాగంగా కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ చనిపోయి మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారని ప్రశ్నించారు.

కృష్ణ భగవాన్ అడిగిన ప్రశ్నకు హైపర్ ఆది సమాధానం చెబుతూ మేమిద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాం ఒకరి తర్వాత మరొకరిని కంటాము అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.

"""/"/ ఈ విధంగా హైపర్ ఆది కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి ఇలా మాట్లాడటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఆమె సిగ్గుపడుతూ ఉండిపోయింది.

అయితే గతంలో కూడా యాంకర్ అనసూయ రష్మి పై కూడా ఈ విధమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు వేసేవారు.

ఇలా కొన్నిసార్లు ఆది డైలాగులు పరిది దాటినప్పటికీ మనసు చంపుకొని నవ్వే వాళ్ళు.

ఇక కొత్త యాంకర్ సౌమ్యకి కూడా అదే పరిస్థితి ఎదురైంది.ముందు ముందు సౌమ్య ఇంకా ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగ మీద వచ్చే వ్యతిరేకతకు ‘స్పిరిట్ ‘ తో చెక్ పెట్టబోతున్నాడా..?