ఆది సాయికుమార్.. మరో సినిమా స్టార్ట్..!

ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆది సాయి కుమార్.

ఇప్పటికే నాలుగైదు సినిమాలు క్యూలో ఉండగా లేటెస్ట్ గా ఆది మరో సినిమా స్టార్ట్ చేశాడు.

నూతన దర్శకుడు శివశంకర్ దేవ్ డైరక్షన్ లో ఆది సాయి కుమార్ హీరోగా ఒక క్రైం థ్రిల్లర్ మూవీ వస్తుంది.

ఈ సినిమాను అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.డిస్ట్రిబ్యూషన్ రంగంలో దాదాపు 32 ఏళ్లుగా ఉన్న శాంతయ్య గారి తనయుడిగా ఆయన ప్రోత్సాహంతో నిర్మాతగా మారానని అన్నారు అజయ్ శ్రీనివాస్.

దేవ్ చెప్పిన కథ బాగా నచ్చింది.అందుకే ఈ సినిమా చేస్తున్నానని అన్నారు అజయ్.

ఈ సినిమా తప్పకుండా ఆది కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా మిగులుతుందని అన్నారు డైరక్టర్ శివశంకర్ దేవ్.

ఆది కూడా వరుస సినిమాలతో హిట్ టార్గెట్ తో వస్తున్నాడు.దాదాపు ఐదారు సినిమాలతో వస్తున్న ఆది సాయి కుమార్ ఈసారి ఏదో ఒక సినిమాతో పక్కా కమర్షియల్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

మరి ఆది చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.ఇక దేవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

నేడే ‘ జీరో షాడో డే ‘.. మీరు కూడా ఈ సమయాల్లో ఓసారి ట్రై చేయండి..