చైన్ స్నాచింగ్ చేసి పట్టుబడ్డ యువకుడు..ఇదే ఫస్ట్ టైం చెబుతున్న వైనం

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం నలంద జూనియర్ కళాశాల వద్ద నుండి డీమార్ట్ కు నడిచి వస్తున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన యువకుడు.

ఆ వృద్ధురాలు దొంగ దొంగా అంటూ గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు వెంబడించి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకుడిని పట్టుకొని, రెండు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని,దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

చైన్ స్నాచింగ్ కు పాల్పడిన యువకుడు తనది ఖమ్మం అని చెబుతున్నాడు.అయితే అతనికి ఇదే తొలిసారట.

అందుకే దొరికాడేమోనని అతని మాటలు విన్నవారు అనుకుంటున్నారు.

ఆ ఒక్క పని చేస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ కు హిట్లు.. మారాల్సిన తరుణం ఆసన్నమైందా?