ముసలాయనపై అడవి పంది అటాక్.. ఒళ్లు గగుర్పొడిపించే వీడియో వైరల్..
TeluguStop.com
అడవి పందులు చాలా అగ్రెసివ్గా ఉంటాయి.ఎవరైనా కనిపిస్తే చాలు వారిని దారుణంగా గాయపరిచే దాకా అవి వదలవు.
ఈ అడవి పందులు(wild Boar) ఇప్పటిదాకా ఎంతోమంది మనుషులను చంపేస్తాయి కూడా.వీటి దాడులకు సంబంధించిన వీడియోలు అడపా దడపా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
వాటిని చూస్తే మనం షాక్ అవ్వక తప్పదు.తాజాగా అలాంటి భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు తిరుగుతోంది.
ఈ వీడియోలో, ఒక ముసలాయన(old Man) రోడ్డు మీద వెళ్తుండగా, ఒక అడవి పంది అతనిపై దాడి చేసింది.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు ఆ పందిని ఆపాలని ప్రయత్నించినా, అది వెనక్కి తగ్గలేదు.
"""/" /
"americasgoneviral" అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ భయంకరమైన వీడియోను పోస్ట్ చేసింది.
అందులో, ఒక ఒక పెద్దాయనపై ఒక అడవి పంది ఎంతో క్రూరంగా దాడి చేస్తుంది.
ఆ పెద్దాయన కూడా నందిని తన కాళ్లతో తన్నుతూ విడిపించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ ఆ పంది చాలా బలంగా ఉంది అది అతడిని కొరికేస్తూ బాగా గాయపరిచింది.
వ్యక్తి ఒక పెద్ద కర్ర పట్టుకుని ఆ పంది పైన గట్టిగా కొట్టాడు.
అయినా సరే అది కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు సరి కదా దాని ఎటాక్ ను మరింత తీవ్రం చేసింది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియదు కానీ, ఈ వీడియో చూసి ప్రపంచం మొత్తం భయపడిపోయింది.
"""/" /
కొద్ది రోజుల క్రితం ఈ వీడియో పెట్టిన తర్వాత, 57 వేల మందికి పైగా లైక్ చేశారు.
చాలా మంది ఈ వీడియో కింద కామెంట్లు చేస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఒకరు "ఏడుగురు మగాళ్లు కూడా దాన్ని ఆపలేకపోయారు" అని రాస్తే, మరొకరు "ఆ వృద్ధుడు చాలా గాయపడి ఉంటాడు" అని రాశారు.
మరొకరు "ఆ పంది ఆ పరిసరాలనే ధ్వంసం చేసింది" అని రాస్తే, మరొకరు "ఒక జంతువు ఒకదాన్ని లక్ష్యంగా చేసుకుంటే దాన్ని ఏం చేసినా వదలదు" అని రాశారు.
నారా రోహిత్, సిరి పెళ్లి తేదీ ఫిక్స్.. ఆ తేదీనే వాళ్లిద్దరి పెళ్లి జరగనుందా?