రంగారెడ్డి జిల్లా నార్సింగి దాడి ఘటనలో ట్విస్ట్..!

రంగారెడ్డి జిల్లా నార్సింగి దాడి ఘటనలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో కీలక విషయాలు బయటపడ్డాయి.కరణ్ సింగ్ గ్యాంగ్ హిజ్రాలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో హిజ్రాలను కాపాడటానికి వచ్చిన కిశోర్ కుమార్ రెడ్డి, అతని స్నేహితునిపై కరణ్ సింగ్ గ్యాంగ్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.

ఈ దాడిలో కిశోర్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోగా ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతరం కేసు విచారణకు వెళ్లిన ఎస్ఓటీ కానిస్టేబుళ్లపై కరణ్ సింగ్ గ్యాంగ్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ ఆయిల్ మీకోసమే!